హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలుగు రాష్ట్రాల మాదిగ సంఘాల జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మౌనదీక్ష చేపట్టారు. దీక్షకు ముందు పిడమర్తి రవి మాట్లాడుతూ, నూతన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టేంతవరకు బీజేపీ సర్కార్ను వదిలిపెట్టేదిలేదని తెలిపారు.
మాదిగలకు 12శాతం రిజర్వేషన్ సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. దీక్షలో ఎస్సీ జేఏసీ తెలుగు రాష్ర్టాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వర్రావు, మాదిగ హకుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైసా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.