హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ధరణి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం తెలంగాణ భవన్లో ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షుడిగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ను ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డీ అశోక్, ఉపాధ్యక్షుడిగా ఆర్ సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా ఎం అనిత, కోశాధికారిగా జీ హిమేశ్కుమార్, గౌరవ సలహాదారుగా సీహెచ్ శ్రీధర్ను ఎన్నుకున్నారు.
ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం తదితర అంశాలపై మాట్లడారు. ఆయా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతానని రూప్సింగ్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఎస్టీఎస్ చైర్మన్ జగన్రావు, బీడీఎల్ ఎంప్లాయీస్ చైర్మన్ దానకర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.