అయిజ రూరల్, ఏప్రిల్ 3 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేశవరం వాసుల తాగునీటి సమస్య పరిష్కారానికి యంత్రాంగం ముందుకొచ్చింది. ‘ఒక్క బిందె నీళ్లు.. 2 గం టలు’ శీర్ష్షికన ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్ అధికారులతో కలిసి గ్రామాన్ని సం దర్శించారు.
తాగునీటి కోసం తుంగభద్ర నదిలో చెలిమెల నీటికోసం గంటల తరబడి నిరీక్షించి నీటిని పట్టుకుంటున్న కష్టాలను వారు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు సరిపడా రావడం లేద ని, గ్రామ బోరు మోటర్ల నుంచి ఉప్పునీళ్లు వస్తున్నాయని అధికారులకు చెప్పారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.