మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఆమనగల్లు, డిసెంబర్ 14: అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రాలుగా పరిగెత్తిస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముం దుకు తీసుకెళ్తున్న విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి కొనియాడారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులను జారీచేస్తూ.. జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ త్వరలోనే తీపికబురు చెప్తారన్నా రు. అన్ని శాఖల్లో ఖాళీల భర్త్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు మంత్రి శుభా కాంక్షలు తెలిపారు