హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్గా మారినట్టు వస్తున్న వార్తలు తప్పని లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రపిళ్లై తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద అరుణ్పిళ్లై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని తెలిపారు.
తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.