హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మంగళవారం నాటికి న్యాయమూర్తి వాయిదా వేశారు. హత్య కేసులో అప్రూవర్గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ ఫిర్యాదుదారులు ఎంవీ కృష్ణారెడ్డి, వైఎస్ భాసర్రెడ్డి వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో రిట్లను దాఖలు చేశారు.
వివేకా హత్యకు దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేశారని, హత్యచేసిన తీవ్ర అభియోగాలు ఉన్నాయని, అరెస్టు చేయకుండానే ముందస్తు బెయిల్కు సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది డీ ప్రకాశ్రెడ్డి వాదించారు. కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ కే సురేందర్ మంగళవారానికి వాయిదా వేశారు. భాసర్రెడ్డి దాఖలు చేసిన కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యేందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.