TSPSC Paper Leak | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీపై సిట్ జరుపుతున్న దర్యాపులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ నిర్వహించిన పెద్దపల్లి ఇరిగేషన్ ఏఈ పూల రమేశ్.. తన దందాకు ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు తేలింది. తద్వారా రూ.10 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. అందులో రూ.1.1 కోట్ల వరకు రాబట్టినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు.
ఆ వివరాలు ఇవీ..