హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా కాప్రాలో వేల కోట్ల విలువ చేసే 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్అదాలత్లో రాజీ చేసుకున్నందున అవార్డు అమలు చేయాలంటూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీచేసింది.
ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. 90 ఎకరాల భూమి విషయంలో లోక్అదాలత్ అవార్డు జారీ చట్ట వ్యతిరేకమని పేర్కొంది.