హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ఆయన అరెస్టుకు ఉత్తర్వులు ఇవ్వాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు సుహాన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు నల్లగొండ కోర్టును ఆశ్రయించకుండా హైకోర్టుకు రావడాన్ని జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి తప్పుపట్టారు.
కింది కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. సుధాకర్ను హతమార్చేందుకు తన అనుచరులు వంద కార్లలో తిరుగుతున్నారంటూ ఇటీవల వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో సుధారక్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వెంకట్రెడ్డి నుంచి తన తండ్రికి ప్రాణహాని ఉన్నదని సుధాకర్ కుమారుడు సుహాన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.