హైదరాబాద్, మార్చి20 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, హత్యాయత్నానికి పాల్పడ్డానన్న ఆరోపణలతో తనపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ కే సుజన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఈ కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.