హైదరాబాద్, నవంబర్ 14, (నమస్తే తెలంగాణ): గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలోని 34 ఎకరాల భూమి మ్యుటేషన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఎస్ హరీశ్పై దాఖలైన కోర్టు ధికార పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జైహింద్ గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన ఈ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది.
ఈ వ్యవహారంలో పిటిషనర్ దరఖాస్తును నాటి కలెక్టర్ తిరసరించడంతోపాటు పట్టాదార్ పాస్బుక్ జారీకి నిరాకరించారని, ఇది కోర్టు ధికరణ కాబోదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ వాదనను ఆమోదించిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి.. కలెక్టర్పై కోర్టు ధికరణ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.