హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వారికి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్లు పొందిన వారిలో 16 మంది తహసీల్దార్లు, ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు.