హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ది కుటుంబ పాలన.. తెలంగాణ వచ్చినంక ఆ నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు.. సభలో కూడా వాళ్ల కుటుంబమేనా?.. కొన్నిరోజులుగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న విమర్శలివి. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. మాటలు ఎన్నయినా మాట్లాడొచ్చు. కానీ చేతలు ఎలా ఉన్నాయన్నదే ప్రశ్న. ఎమ్మెల్యే హరీశ్రావు ఆరేడుసార్లు ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమకాలం నుంచీ ప్రజా ప్రతినిధిగా ప్రజలచేత ఎన్నుకోబడుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా వాళ్లది కుటుంబ పాలన అయితది..
అయితే.. ఒక్కసారి ఈ ఫొటోలను గమనించండి. మొదటి ఫొటోలో కనిపిస్తున్న అధికారిక కాన్వాయ్ సీఎం రేవంత్రెడ్డి త మ్ముడు కొండల్రెడ్డిది. కామారెడ్డిలో ఈ నెల 14న కాం గ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన అధికార లాంఛనాలతో ఇలా తరలివచ్చి పాల్గొన్నారు.
రెండో ఫొటోలో ఉన్నది కూడా కొండల్రెడ్డే.. ఆయనకు పోలీస్ కాన్వాయ్తోపాటు 2+2 గన్మెన్ భద్రతను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిసింది. ఈ ఫొటోలో కొండల్రెడ్డి వెనుక నిలబడిన గన్మెన్ను చూడవచ్చు.
ఇక మూడో ఫొటో అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎ మ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన మంగళవారం వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనిది. ఇందులో ఎడమవైపు చివరణ కూర్చున్న వ్యక్తి పేరు తిరుపతిరెడ్డి. రేవంత్రెడ్డికి స్వయానా అన్న.బుధవారం ఆయన కలెక్టరేట్కు వెళ్లి, కలెక్టర్ ముందే సోఫాలో కూర్చొని అందరినీ అజమాయిషీ చేసినట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. రేవంత్రెడ్డి సోదరులు ఎ మ్మెల్యేలు కాదు. ఎంపీలు కాదు.. ఏ రకమైన ప్రజాప్రతినిధులు కూడా కాదు. కానీ, అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం వా రికి భారీ పోలీస్ కాన్వాయ్ కేటాయించింది. భారీ భద్రత ఏర్పాటు చేసింది. రేవంత్రెడ్డి ఇన్నాళ్లూ కేసీఆర్ది కుటుంబ పాలన అని విమర్శించారు. మరి ఏ హోదా లేని ఆయన సోదరులు అధికారిక సమావేశాల్లో ఎలా పాల్గొంటున్నారు? దీన్నేమంటారు? దీనికి రేవంత్ ఏమంటారు? అని నెటిజన్లు ఆ ఫొటోలను సోషల్మీడియాలో షేర్చేస్తూ ప్రశ్నిస్తున్నారు.