జయశంకర్ భూపాలపల్లి : ఆపద మొక్కులు తీర్చే ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నది. జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమైన వేంకటేశ్వర స్వామి జాతర నేటికీ అశేష భక్తజన సందడితో కొనసాగుతుతున్నది.
వేంకటేశ్వర స్వామిని నమ్మి కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తిరుమలగిరి రెండో తిరుపతిగా కూడా భక్తులు అభివర్ణిస్తారు. జాతరకు ఇప్పటివరకు 1.5 లక్షల మంది భక్తులు హాజరైనట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.