తొగుట/మిరుదొడ్డి, ఏప్రిల్ 5 : రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చెలగాటం అనే కథనం శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్లో ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యుత్తు శాఖ గజ్వేల్ డీఈ భానుప్రకాశ్, తొగుట ఏడీఏ శ్రీనివాస్రావు, ఏఈ శ్రీనివాస్రావు స్పందించారు. ఈ అధికారులు శుక్రవారం వెంకట్రావుపేటలోని కత్తుల రాములు, కత్తుల లింగం, మిరుదొడ్డి రాజశేఖర్ పొలాల వద్ద గల ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీఈ భానుప్రకాశ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అదనంగా మరో 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ను, 3 ఎర్తింగ్ బిల్లలను నూతనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్తు సమస్యలు తలెత్తితే వెంటనే విద్యుత్తు శాఖ అధికారుల దృష్టికి తేవాలన్నారు. తమ సమస్య పరిష్కారానికి కృషిచేసిన నమస్తే తెలంగాణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.