సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం సలాఖపూర్లో నడి రోడ్డుపై తమ వయ్యారాలను ఒలకబోస్తు రోడ్డును దాటుతున్న ఓ బాతుల గుంపు చూపరులను ఆకట్టుకుంది. తెల్లని వన్నెలతో హంసలను తలపిస్తూ కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాన్ని ఆదివారం మద్దూరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ మ్యాక వెంకటేశ్వర్లు తన కెమెరాలో బందించారు.