హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన తాతాలిక జప్తును ధ్రువీకరించే అడ్జడికేటింగ్ అథారిటీలో జ్యుడిషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
సాంకేతిక సభ్యుడు ఇచ్చిన ఉత్తర్వులు, ఈడీ జప్తు చర్యలు చెల్లవని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. కార్వీ గ్రూపు కంపెనీలతోపాటు పలు ఇతర కంపెనీల అస్తుల తాతాలిక జప్తును ధ్రువీకరిస్తూ అడ్జడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవన్న సింగిల్ జడ్జి తీర్పునకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం ఆమోదించింది.