హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) ధూపదీప నైవేద్య పథకానికిగాను దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27తో గడువు ముగుస్తున్నది. అర్హతగల ఆలయాలకు ఈ పథకం కింద నెలకు ధూపదీప నైవేద్యాలకు రూ. 2000, అర్చకుని గౌర భృతి కింద రూ. 4000 చొప్పున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది.
కాగా, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3,645 ఆలయాలకు ఈ పథకం అమలవుతుండగా, కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 1736, జీహెచ్ఎంసీ వెలుపల మరో 1160 ఆలయాలకు కలిపి మొత్తం 2,896ఆలయాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ అర్హతగల ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. వివరాలకు, దరఖాస్తు డౌన్లోడ్ చేసుకునేందుకు www.endowments.ts.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.