హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. లక్ష మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఈ పరీక్ష నిర్వహణకు 139 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కన్సార్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ విజేందర్కుమార్ తెలిపారు.
ఈ ఏడాది క్లాట్ పరీక్షకు రికార్డుస్థాయిలో 24.5 శాతం అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు 34.7శాతం పెరగగా, పోస్టు గ్రాడ్యుయేషన్ అప్లికేషన్లు 25.8 శాతం పెరిగాయి. క్లాట్ పరీక్షను గతంలో జూన్లో నిర్వహించనుండగా, ఇప్పుడు డిసెంబర్కు మార్చడంతో డిమాండ్ ఏర్పడింది.