అబద్ధం
సికింద్రాబాద్లోని ఉజ్జయినీ అమ్మవారి విగ్రహాన్ని మారుస్తున్నారనే ప్రచారం ఒకటిరెండు రోజులుగా సోషల్మీడియాలో విస్తృతంగా సాగుతున్నది. మూల విరాట్టును తొలగించి కొత్త విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నాలు సాగుతున్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం నూటికి నూరుపాళ్లు అబద్ధం.
నిజం
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి విగ్రహంపై ఉండే కవచాన్ని మార్చాలని అధికారులు మొదట అనుకొన్నారు. కానీ ఆ ఆలోచనను కూడా ఇప్పుడు ఉపసంహరించుకొన్నారని, గర్భాలయంలో ఎలాంటి మార్పులు చేయటం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. అమ్మవారి విగ్రహాన్ని మారుస్తున్నారన్న వదంతులను నమ్మవద్దని భక్తులను కోరారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధిపై నిర్ణయాలు ఉంటాయని స్పష్టంచేశారు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. భక్తులను తప్పుదోవ పట్టించాలనుకొనేవారి సంగతి అమ్మవారే చూసుకొంటారని అన్నారు.