హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : వైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సంభవిస్తుండగా, వాటి నివారణ, నియంత్రణకు బడ్జెట్లో కేటాయించిన 2% ఏమాత్రం సరిపోద ని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పెరుగుతున్న వ్యాధుల భారం, బడ్జెట్ ప్రాధాన్యతలకు మధ్య అసమతుల్యతను స్పష్టం చేస్తున్నదని అంటున్నారు. చికిత్స కన్నా నివారణపై దృష్టిసారించాల్సిన కేంద్రం, కేవలం విధాన ప్రకటనలకే పరిమితం అవుతున్నదని అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ లో ప్రజారోగ్యం, జీవనశైలి మార్పులు, ప్రా రంభ దశ స్క్రీనింగ్, నివారణ చర్యల కన్నా దవాఖాన కేంద్రిత, బీమా ఆధారిత మోడల్కే ప్రాధాన్యమివ్వడం విమర్శలకు తావిచ్చింది.
బడ్జెట్లో మందుల నియంత్రణకు ఎలాం టి సంస్కరణలు చేపట్టలేదు. మందులు, డయాగ్నోస్టిక్లకు రోజువారీ అయ్యే ఖర్చు అధికమై ఓపీడీ(ఔట్ ఆఫ్ పాకెట్ బర్డెన్) పెరుగుతున్నదని, ఈ పరిణామం పేదరికానికి దారితీస్తున్నదని హెచ్చరిస్తున్నారు. ఆశలు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది జీతాల పెంపుపై ఊసేలేదు.
దేశ జీడీపీలో 2.5-3% ఆరోగ్యరంగానికి కేటాయించేలా కేంద్రం రోడ్డు మ్యాపును ప్రకటించాలి. నేషనల్ హెల్త్ మిషన్కు నిధుల కేటాయింపుల్లో ఆలస్యం చేయొద్దు.
– డాక్టర్ రంగారెడ్డి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు