హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సీపీఆర్వో అయోధ్యరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు అందింది. ఆయన ప్రభుత్వ పదవిలో ఉంటూ సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
అయోధ్యరెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తాజాగా చేసిన పోస్ట్లను ఆధారాలుగా చూపించారు. అయోధ్యరెడ్డిని ప్రభుత్వం డిసెంబర్ 12న సీపీఆర్వోగా నియమించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదన్న నిబంధనను ఆయన అతిక్రమించారని పేర్కొన్నారు. పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.