అమీర్పేట, ఏప్రిల్ 19: హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును శుక్రవారం సనత్నగర్ పీఎస్కు బదిలీ చేశారు. వివరాలల్లోకెళితే.. కూకట్పల్లి విజయ్నగర్ కాలనీలో నివసిస్తున్న సుదర్శన్, సనత్నగర్కు చెందిన రాజా, విశ్వనాథరాజు కలిసి 2017లో జెక్కాలనీలో ఓ అపార్ట్మెంట్ను డెవలప్మెంట్ చేశారు.
అందులో సుదర్శన్ తన వాటా కింద ఓ ఫ్లాట్ను తీసుకున్నాడు. కానీ, వ్యాపారంలో నష్టం రావడంతో రూ.5 లక్ష లు అదనంగా ఇవ్వాలని రాజా, విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. అందుకు సుదర్శన్ నిరాకరించడంతో వారు అప్పటి టాస్క్ఫో ర్స్ డీసీపీ రాధాకిషన్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తనను టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి నిర్బంధించి కొట్టారని సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాధాకిషన్రావుపై కేసు నమోదైంది.