హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పిల్లలకు తల్లిపాలు ఒక వరం. వాటిని మించిన పౌష్టికాహారం బిడ్డకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరుకదు. పాలు ఇవ్వడం ద్వారా అటు తల్లికి.. వాటిని తాగడం ద్వారా బిడ్డకు ఆరోగ్యకరమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఆరు నెలల వయసు వచ్చేవరకు బిడ్డకు కచ్చితంగా తల్లిపాలే తాగించాలని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోతూ రసాయన మిశ్రమాలతో తయారైన కృత్రిమ పాలు తాగిస్తూ చేజేతులా పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందుకు ఏటా ఆగస్టు 1-7 మధ్య ‘తల్లిపాల వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వారోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై కథనం.
ముర్రుపాలు..
అపోహ: బిడ్డకు ముర్రుపాలు పడితే అనారోగ్యమని చాలా మంది భావిస్తుంటారు. పిల్లలు పుట్టగానే ముందుగా తేనె, చెక్కెర నీళ్లు వంటివి ఇవ్వడం శ్రేయస్కరం అని అనుకొంటారు.
వాస్తవం: పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలి. అప్పుడే పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ముర్రుపాలు పట్టడం ద్వారా తల్లికి ఉన్న రోగనిరోధక శక్తి పాల ద్వారా బిడ్డకు లభిస్తుంది. ఇది జీవితాంతం రక్షిస్తుంది. శిశువు పేగులను శుభ్రం చేస్తాయి. మలవిసర్జన సాఫీగా సాగేలా చేస్తాయి.
తల్లిపాల ప్రయోజనాలు
తల్లికీ ప్రయోజనం