మోత్కూరు, జనవరి 18: కేవలం రూ.2,100 కోసం పాత ఇనుప సామాను వ్యాపారిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఇన్చార్జి డీసీపీ అరవింద్బాబు తెలిపారు. వివరాళ్లోకెళ్తే.. సూర్యాపేట జిల్లా మోత్కూరు కు చెందిన ఎండీ ఖలీమొద్దీన్ (65) పాత ఇనుప సామాను వ్యాపారి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంకు చెందిన సిరిపాటి కిరణ్ (32) మోత్కూరులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 15న సంక్రాంతి రోజు మద్యం తాగేం దుకు తన పాత ఇనుప సామానును ఖలీమొద్దీన్కు రూ.800కు అమ్మాడు. అదేరోజు సాయంత్రం ఖలీమొద్దీన్ ఇంట్లో వుండగా పారతో కొట్టి హత్య చేసి, రూ.2100తో పారిపోయాడు. విచారణ అనంతరం పోలీసులు కిరణ్ను అరెస్టు చేశారు.