సూర్యాపేట, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానంలో కొలువైన పరమశివుడిని మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి సందర్శించారు. భారీ శివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు. సుమారు గంట సేపు శివ చిత్తంలో మునిగితేలారు. శుక్రవారం సూర్యాపేటలో జరిగిన సాహిత్య సభకు తణికెళ్ల భరణి హాజరయ్యారు.
ఇందులో మంత్రి జగదీశ్రెడ్డి నిర్మింపజేసిన మహాప్రస్థానం గురించి కవులు తమ ప్రసంగంలో వివరించారు. మహాప్రస్థానాన్ని చూపించాలని మంత్రిని తనికెళ్ల కోరారు. దీంతో సభ ముగిసిన వెంటనే మంత్రి స్వయంగా ఆయనను మహాప్రస్థానానికి తీసుకెళ్లారు. శ్మశానవాటిక నలుమూలలా తిరుగుతూ మహా అద్భుతం అంటూ జాషువా పద్యాన్ని నెమరువేసుకున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న మహాప్రస్థానంను చూసి ధన్యోస్మి అంటూ తనికెళ్ల వెనుదిరిగారు. అంతకు ముందు ఆయన మాట్లా డుతూ ఇంతటి మహాద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏండ్ల క్రితం యూరప్లో చూ శానని, అక్కడ శ్మశానం ఇరుకుగా ఉన్నదని చెప్పారు. ఆ తర్వాత మొదటి సారిగా అంతటి నిర్మాణాన్ని చూశానని చెప్పారు.