బంజారాహిల్స్/ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 21: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం సమీపంలో శాంతియుతంగా ఆందోళనచేస్తున్న టీఆర్ఎస్వీ నేతలపై మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై రేవంత్రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లినవారిపై గూండాగిరి చెలాయించారు. కర్రలతో దాడి చేస్తూ, రాళ్లు విసురుతూ స్వైరవిహారం చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం నెట్టేసి, కర్రలతో వీరంగం సృష్టించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కటారి స్వామియాదవ్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి జహీర్ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, ఎన్ఎన్రాజు, నిమ్మలకోటి నవీన్, ఖలీమ్, లోకేశ్తోపాటు పలువురు కార్యకర్తలు జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసం వద్ద ధర్నాకు దిగారు. అప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. టీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే రేవంత్రెడ్డి నివాసం నుంచి కొంతమంది కర్రలతో పరుగెత్తుకుంటూ వచ్చి, రాళ్లు విసురుతూ, కర్రలతో దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండలో టీఆర్ఎస్వీ నేత కటారి స్వామియాదవ్, జహీర్ఖాన్కు గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ వారిని జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
ప్రజాస్వామ్యయుతంగా రేవంత్రెడ్డి నివాసం సమీపంలో నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి, తమను చంపేందుకు యత్నించారని టీఆర్ఎస్వీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై రేవంత్రెడ్డి దాడి చేయించడం హేయమైన, పిరికిపంద చర్య అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, గుండగాని కిరణ్గౌడ్ పేర్కొన్నారు. తాము కూడా దాడులకు దిగితే కాంగ్రెస్ నాయకులెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదట దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఏవో దీక్షలు చేస్తానని రోడ్లెంబడి బయలెల్లిన శర్మిలమ్మకు తన సభలకు జనాలను తెచ్చుకోవడం చానా కష్టమైతున్నది. మంగళవారం బోడుప్పల్లో దీక్ష చేద్దామని ఓ టెంట్ వేసుకొని.. బయలుదేరిన శర్మిలమ్మ.. జనాలను తేవాలని సప్లయర్ని పురమాయించారు. సదరు సప్లయర్ దగ్గర్లోనే ఉన్న కెనరానగర్ ప్రాంతంలో పొద్దున్నే కూలిపనులకోసం ఎదురుచూస్తున్న అడ్డాకూలీలను ఒక్కొక్కరికి రూ.400 ఇస్తామని చెప్పి పట్టుకొచ్చారు. తీరా వచ్చాక అనుమతి లేదంటూ శర్మిలమ్మను పోలీసులు అరెస్టుచేశారు. కూలీలకు డబ్బులివ్వకుండా మధ్యవర్తిముఖం చాటేశాడు. ఏం చేయాలో తోచని కూలీలు.. అక్కడే నిరసనకు దిగారు.
పీర్జాదీగూడ