జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ జిల్లాలోని రేగొండ మండలం జంషెడ్ పేట్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాత్రులను చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రభుత్వ దవాఖానలో ప్రమాద బాధితులకు ములుగు జిల్లా వైద్యాధికారి దగ్గరుండి వైద్యం అందించారు.