Murder | శంషాబాద్ రూరల్/ఎల్బీనగర్ జూన్ 9: ఆలయానికి వచ్చిన భక్తురాలితో వివాహేతర సంబంధం పెట్టుకొని, పెండ్లి ప్రస్తావన తేగానే హతమార్చాడో పూజారి. తనకేపాపం తెలియ దన్నట్టు హతురాలి తల్లితో కలిసి తన మేన కోడలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదారి పట్టించాడు. అంతటి తో ఆగకుండా తాను పూజలు చేసే దేవా లయం పక్కనే శవాన్ని పూడ్చి, దర్జాగా బొడ్రా యి వేడుకలను ముందుండి నడిపించాడు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనను మూడు రోజుల్లోనే ఛేదించారు శంషాబాద్ జోన్ పోలీసులు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేద్కర్ కోన సీమ జిల్లా పీ గన్నవరం మండలం నరేంద్ర పురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ సరూర్నగర్లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు. స్థానికంగా మైసమ్మ దేవాయంలో పూజారిగా ఉంటూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి నిరుడు ఏప్రిల్లో నగరానికి వచ్చి ఇదే కాలనీలో నివాసముం టున్నది. గతంలో పలు సినిమాలు, సీరియ ల్స్లో చిన్న పాత్రల్లో నటించిన అప్సర ప్రస్తు తం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నది.
పూజారి సాయికృష్ణ పని చేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు శారీర కంగా దగ్గరయ్యారు. దీంతో తనను వివా హం చేసుకోవాలని అప్సర తరచూ సాయికృ ష్ణపై ఒత్తిడి తీసుకురావటం మొదలు పెట్టింది. ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. పథకం ప్ర కారం 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం లోని సుల్తాన్పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి చేరుకున్నాడు. కారులోనే గాఢనిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్తో ఊపిరి ఆడకుండా చే సేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవరులో చుట్టి డిక్కీలో వేసుకొని ఇంటి వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్నగర్ ఎమ్మా ర్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురి గురిం చి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసి నా స్పందించడంలేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు.