చేర్యాల, డిసెంబర్ 31 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్ దర్శనాన్ని ఈనెల ఒకటోతేదీ సాయంత్రం 6 నుంచి 6వ తేదీ వరకు నిలిపివేస్తున్న ఆలయ ఈవో ఆలూరి బాలాజీశర్మ తెలిపారు. ఆదివారం ఆయన స్వామి వారి ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 7న స్వామి వారి కల్యాణోత్సవం (బ్రహ్మోత్సవాల) సందర్భంగా స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు అలంకరణ నిమిత్తం దర్శనం నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
ఈనెల 7న ఉదయం 6 నుంచి భక్తులకు స్వామి వారి మూలవిరాట్ పునఃదర్శనం కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్వామి వారి మూలవిరాట్ దర్శనం నిలిపివేసిన తేదీల్లో అర్ధమండపంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాల దర్శనం, పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.