బతుకమ్మ పాట ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ భాష – సాంస్కృతికశాఖ, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా 100 మంది మహిళలతో రూపొందించిన ప్రత్యేక బతుకమ్మ పాట -2021ను హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామని, బతుకమ్మ పండుగ సంబురాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతాని రంగమ్మ పాడిన పాట మూలాల ఆధారంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ నేతృత్వంలో రచయిత కేశవ్ రాసిన ఈ పాటను గాయని మధుప్రియ ఆలపించారు. రాజ్కిరణ్ సంగీతం అందించారు. కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ విద్యాసంస్థల చైర్మన్ రవికుమార్, కన్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.