హైదరాబాద్: రవాణా శాఖలో ఆన్ డ్యూటీలను (On Duty) ప్రభుత్వం రద్దుచేసింది. ఎంవీలు, ఏఎంవీలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ ఓడిలను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ను జేటీసీ అడ్మిన్గా ట్రాన్స్ఫర్ చేసింది. హైదరాబాద్ జేటీసీ అడ్మిన్గా ఉన్న మమతా ప్రసాద్ ఐటీ అండ్ వీఐజీగా, ఇప్పవరకు ఆ స్థానంలో కొనసాగిన రమేశ్ హైదరాబాద్ జేటీసీగా బదిలీ అయ్యారు.