హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లికేషన్స్కు చెందిన ‘తెలంగాణ టుడే’ ఆంగ్ల దినపత్రికకు ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఇన్ ప్రింట్ ఆసియా’ అవార్డు-2023 లభించింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్కు చెందిన ఇండియన్ ప్రింటర్స్ సమ్మిట్ 31వ ఎడిషన్ గురువారం కేరళ రాజధాని కొచ్చిలో జరిగింది.
ఈ సందర్భంగా ముద్రణలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ‘తెలంగాణ టుడే’కు అవార్డు ప్రకటించారు. సంస్థ తరఫున చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సీహెచ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు.