హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కోర్టు అనుమతి తీసుకొని మల్టీజోన్ -2లో పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, తపస్ అధ్యక్షుడు హనుమంతరావు శుక్రవారం మంత్రి పీ సబితను కలిసి వినతిపత్రం అందజేశారు. పండిత్, పీఈటీ పదోన్నతులు కల్పించాలని, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు.