సుల్తాన్బజార్, జనవరి 6: లోపభూయిష్టంగా నిర్వహించిన స్టాఫ్నర్సుల నియామక ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 9 మార్కులు వచ్చిన వారి పేరులో మెరిట్ లిస్టులో ఉన్నదని, 50 మా ర్కులు వచ్చినవారి పేరు లేదని ఆగ్రహం వ్య క్తంచేశారు. శనివారం కోఠిలోని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట నర్సింగ్ అభ్యర్థులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బోర్డు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన నర్సింగ్ అభ్యర్థులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, గ్రూప్-2 పరీక్ష రద్దు తరహాలో ఈ నర్సింగ్ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్కువ మార్కు లు వచ్చిన వారు, నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారిని మెరిట్ లిస్టులో నమోదు చేసి, 50కి పైగా మార్కులు వచ్చిన అర్హులైన అభ్యర్థులను నిర్ధాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు. ఏ నియామకాల్లోనైనా మార్కులు కలుపుతారని, కానీ ఈ నర్సింగ్ నియామకాల ప్రక్రియలో మాత్రం వెయిటేజీ మార్కులను తొలించడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.