హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ):ప్రీ స్కూల్స్గా మారిన అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం ప్ర త్యేకంగా రూపొందించిన ‘తంగేడుపువ్వు’, ‘పాలపిట్ట’ పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పలు మార్పులు, చేర్పులు చేసింది. 201920లోనే ప్రభుత్వం ఈ పుస్తకాలను తీసుకొచ్చింది.
ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 4 ఏండ్ల ఎల్కేజీ చిన్నారులకు తంగేడుపువ్వు (నాలుగు పుస్తకాల సెట్), 4 నుంచి 5 ఏండ్లు ఉన్న పిల్లలకు పాలపిట్ట (5 పుస్తకాల సెట్) పుస్తకాలను అందించేందుకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 6 నుంచి 11 వరకు నిర్వహించిన అంగన్వాడీ బడిబాటతో ఎన్రోల్ అయిన చిన్నారుల సంఖ్య ఆధారంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలను పంపించనున్నా రు.
చిన్నారుల అభ్యాసన, పరిశీలన వృద్ధిని అంచనా వేసేందుకు ఒక అసెస్మెంట్ (ప్రోగ్రెస్ కార్డు) కార్డును కూడా అందజేస్తారు. కాగా, ‘తంగేడుపువ్వు’, ‘పాలపిట్ట’ పుస్తకాలకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశాలు చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని కేంద్రం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గతంలోనే ప్రశంసించింది.