హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీకి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మండలి న్యాయవాదులు హాజరయ్యారు. ప్రాథమిక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. కాలుష్య నియంత్రణ మండలిచే అమలు చేస్తున్న చట్టాలు, నిబంధనలు వాటి అమలు విధానం గురించి అథారిటీ చైర్మన్ కు అధికారులు వివరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.