ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలోని ఆర్కేనగర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించిన దేశంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఎదగడం ఖాయమని అన్నారు. దేశంలోని ప్రతి పేదవాడికి బీఆర్ఎస్తోనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దామోదర్, వెంకటేశ్వర్ రెడ్డి, చిరంజీవి, సురేశ్,రాజు తదితరులు పాల్గొన్నారు.