తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 26 : బాలల కథా సంకలనాలకు కథలు పంపాలని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ కథలను జనవరి 20లోపు telanganasaraswathaprishath@ gmail. comకు పంపాలని సూచించారు.
బాలల మూర్తిమ త్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ బాంధ వ్యాలు, మానవతా, నైతిక విలువలు, శాస్త్రీయ దృక్ప థం, మాతృభాషా సంస్కృతుల పట్ల అభిమానం వం టి అంశాలపై కథలను ఏ ఫోర్ సైజ్లో ఒకటిన్నర పేజీకి మించకుండా టైప్ చేసి పంపించాలని సూచించారు. ఉత్తమ కథలకు బహుమతులను అందజేస్తామని తెలి పారు. సొంత రచన అనే హామీ కూడా జత చేయాలని, 8885245234 నంబర్లో సంప్రదించాలని కోరారు.