ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 18: మతతత్వ కారు మేఘాలు దేశాన్ని కమ్మేస్తుంటే మౌన ంగా ఉండట సరికాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని న్యూఎరా స్కూల్లో ఆదివారం జరిగిన ఇంజం సీతారామయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. తరగతి గదిలో ప్రపంచాన్ని నిర్మించే సృష్టికర్తలైన ఉపాధ్యాయులు కులమత ఆధిపత్యాలను తిప్పికొట్టే శక్తులుగా ఈ నాటి తరాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. కులమతాల పేరిట దేశాన్ని విభజిస్తుంటే చూస్తూ ఊరుకోవ డం మ ంచిదికాదని అన్నారు. మతోన్మాద శక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. ఐక్యంగా కలిసి ఉన్న సమాజ స్థితిగతులు అస్థిరమవుతున్నప్పు డు దాన్ని చక్కబెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయ లోకంపై ఉన్నదని తెలిపారు.