హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సిటీలో తిరిగే ఏసీ బస్సుల్లో, ఎలక్ట్రిక్ బస్సుల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నది. ఈ ఆలోచనకు ఇప్పటికే కార్యరూపం ఇచ్చిన ఆర్టీసీ యాజమాన్యం పైలట్ ప్రాజెక్టుగా హయత్నగర్ బస్డిపోను ఎంపిక చేసినట్టు తెలిసింది.
అక్కడ్నుంచి తిరిగే 10 బస్సుల్లో మెట్రో తరహాలో స్క్రీన్లు ఏర్పాటు చేసి, అందులో యాడ్స్ ప్రసారం చేస్తున్నది.