TREIRB | హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మొదటి రోజు సజావుగా సాగాయని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు పేర్కొన్నారు. తొలి రోజు నిర్వహించిన పరీక్షలకు 86.54 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.
మొదటి సారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో మొదటి రోజు 10, 920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 9,450 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రేపట్నుంచి పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ పరీక్ష తేదీలను తెలుసుకుని వారం రోజుల ముందుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని మల్లయ్య భట్టు సూచించారు.