హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా నుంచి మరో 4,413 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,168 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో ఇవాళ 81,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 746 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే కరోనా బూస్టర్ డోసు వేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. హెల్ప్లైన్ నంబర్ 040 – 2111 1111 నంబర్కు కాల్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి టీకా వేస్తారని తెలిపారు.