హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 97.26 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,042, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 201, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 51, హనుమకొండలో 47, మంచిర్యాలలో 38, నిజామాబాద్లో 26, ఖమ్మంలో 27, మహబూబాబాద్, పెద్దపల్లిలో 25 కేసుల చొప్పున, మహబూబ్నగర్లో 22 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.