హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ నలుమూలల్లో వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన తెలుగు వారురందరూ పాల్గొన్నారు. లండన్ తెలుగు మహిళలు 2022లో కరీంనగర్కి నిలయమైన ఫిలిగ్రీ వెండి కళలని ప్రోత్సహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైద్య, పారిశ్రామిక, ఐటీ, విద్య తదితర రంగాల్లో స్థిరపడి అగ్రగామిగా నిలిచిన 144 మంది తెలుగు మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు మీనా అంతటి, గంప జయశ్రీ, శౌరిగౌడ్ పాల్గొన్నారు.