గిర్మాజీపేట: పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. వరంగల్ చార్బౌలీకి చెందిన ముజామిల్ షరీఫ్ పాత ఇంటిని కూలీలు బోసు సునీత, సాగర్, కుమార్, జ్యోతి మరికొందరు మరమ్మతు చేస్తున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి పక్కనున్న గోడ కూలి సునీత (28), సాగర్(26) చనిపోయారు. శ్రీను, కుమార్కు తీవ్రగాయాలయ్యాయి.