హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కొత్త సచివాలయంలో 59 మంది ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులకు ప్రత్యేకంగా చాంబర్లతోపాటు పేషీలు, 36 మంది అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులకు చాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు నిర్మించినట్టు రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు.
53 ఉప కార్యదర్శులు, 118 మంది సహాయ కార్యదర్శులకు చాంబర్లు, 1158 మంది సెక్షన్ అధికారులు, సహాయ అధికారులు పని చేసేందుకు పెద్ద హాళ్లు ఏర్పాటు చేసినట్టు సోమవారం పేర్కొన్నారు. నూతన సచివాలయంలో అధికారులకు చాంబర్లు లేవంటూ ఓ దిన పత్రికల్లో వచ్చిన కథనం నిరాధారమైనదని అధికారులు స్పష్టం చేశారు.