నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 18: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు జాతీయ భావం చాటేలా తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఆటపాటలు అభినయంతో ఆద్యంతం ఆహూతులను అలరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్లో జరిగిన వేడుకల్లో బీసీ సంక్షే మ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జగిత్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కే విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సిరిసిల్లలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆవర ణలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, వికారాబాద్లో కలెక్టర్ నిఖిల పాల్గొని కవులు, కళాకారులను సన్మానించారు. ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.
స్వరాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించినట్టు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డిలో నిర్వహించి న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఉన్నత వ్యక్తులుగా మా ర్చడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ జీవోను జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రక టించిన విషయాన్ని గుర్తించారు. కార్యక్రమంలో విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు.
65 ఏండ్ల సమైక్య పాలనలో అణచివేతకు గురైన తెలంగాణను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ప్రగతిబాటలో పయనింపజేస్తూ యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకొన్నాయి. మంత్రి వేముల మాట్లాడుతూ.. అంతరించిపోతున్న యక్షగానం కళను బతికించుకుంటామన్నారు. ఈ వేడుకలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నవ నాగరిక సమాజం నిర్మాణమవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో నిర్వహించిన వేడుకలో మంత్రి మాట్లాడు తూ.. సమాజంలో శాంతి, సుస్థిరతలే అభివృద్ధికి మార్గాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య పాలన కోసమే తెలంగాణ పోరాటం సాగిందన్నారు. మహనీయుల కళలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని, అందుకే తెలంగాణ అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణ కట్టడాలకు గుర్తింపు తెస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ సత్యవతిరాథోడ్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన రామప్ప వైభవం కార్యక్రమంలో మంత్రు లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ప్రము ఖ సంగీత వాయిద్య కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత శివమణిచే ప్రత్యేక సంగీత వాయిద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు ఎంతో కృషి చేశారన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను నిర్వహించిందన్నారు.
నిజమైన స్వాతంత్య్రం, పరిపాలన 2014 జూన్ 2నుంచే ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తిలో నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని పాలన దేశానికే తలమానికంగా నిలవడం గర్వకారణంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా పాల్గొన్నారు.
తెలంగాణ సమాజానికి కళలతో విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులు, కళాకారులను నిర్మల్లో సన్మానించారు. తెలంగాణ సమాజానికి కళలతో విడదీయలేని అనుబంధం ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానం చేశారు.
స్వాతంత్య్రం సాధించిన మహనీయుల త్యాగఫలం వృథా కానియొద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కొందరు కులమతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు.