హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేయటం దారుణమన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడాన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. సంస్కృతి, సంప్రదాయాలు అని పదే పదే మాట్లాడే బీజీపీ నాయకులు ఓ మహిళ నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు?అని ప్రశ్నించారు.
కవితకు సంఘీభావం తెలిపిన వారిలో విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, నన్నపనేని నరేందర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కాలె యాదయ్య, రేఖా నాయక్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు దండె విఠల్, పట్నం మహేందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.