హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అగ్రి ఇన్పుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. భారత్లో అగ్రి ఇన్పుట్స్ పరిశ్రమ టర్నోవర్ రూ.70 వేల కోట్లు కాగా, ఇందులో 10 శాతం తెలంగాణదే కావడం గర్వకారణమన్నారు. రే కన్సల్టింగ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని హోటల్ పార్హయాత్లో అగ్రి బిజినెస్ సమ్మిట్ అవార్డ్స్- 2022 ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్రి ఇన్పుట్స్ ప్రధాన సంస్థలతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రెడా, ఇక్రిసాట్, మేనేజ్, నారమ్, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వంటి సంస్థలు ఉండటం హైదరాబాద్ ప్రత్యేకత అని, విత్తన రంగానికి తెలంగాణ ప్రపంచ ప్రసిద్ధి గాంచిందని వివరించారు. ఇక్కడి వ్యవసాయ విధానాల ఫలాలు దేశంలోని రైతులకు అందేలా కృషిచేయాలని అగ్రి ఇన్పుట్ సంస్థల ప్రతినిధులకు సూచించారు. దేశంలో వంట నూనెల కొరతను గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదన్నారు. అనంతరం పద్మభూషణ్ అవార్డు గ్రహీత రజనీకాంత్ ష్రాఫ్కు అగ్రి బిజినెస్ సమ్మిట్, అవార్డ్స్ 2022 జీవిత సాఫల్య పురసారాన్ని, మంత్రి నిరంజన్రెడ్డికి రైతుబంధు పురసారం ప్రదానం చేశారు.